వైఎస్ మెడల్స్ ని జగన్ వేసుకుని తిరగడం బాలేదు, అధికారం కోసమే వైఎస్ పేరు…!

-

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా వైఎస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాధ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. అధికారం కోసం రాజశేఖర్ రెడ్డి పేరు వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వైస్సార్ ఆశయాలను నెరవేర్చకుండా, చేతకాని పరిపాలన చేస్తుంది వైసీపీ అని ఆరోపించారు.

మడమ తిప్పని మాట తప్పని నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అని అన్నారు. వైఎస్సార్ మెడల్స్ ని జగన్ వేస్కుని తిరుగుతుంటే మాకు ఇబ్బంది గా ఉందని అన్నారు. బీజేపీ, ఆర్.స్.స్ భావజాలంపై పోరాడింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని స్పష్టం చేసారు. వైఎస్ ఆశయాలను నెరవేర్చాలన్నారు. 108, 104 ఆరోగ్య శ్రీ పథకాల్ని వైసీపీ తెచ్చినట్టు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ హయాంలో వైఎస్ తెచ్చారని గుర్తు చేసారు. ఆయనని స్ఫూర్తిగా తీస్కొని పాలనని పరిపాలించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news