కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డి భోరున ఏడ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు భాగోద్వేగానికి గురయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక భోరున ఏడ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డిని ఆయన సన్నిహితులు ఓదార్చారు.

ఇది ఇలా ఉండగా…కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. హోరా హోరీగా సాగిన కౌంటింగ్ లో రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి విజయాన్ని దక్కించుకున్నారు. కాసేపట్లో దీనిపై అధికారులు అధికారిక ప్రకటన చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డి భోరున ఏడ్చారు.
భోరున ఏడ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డి https://t.co/gWkjfaYP4H pic.twitter.com/7C5LUUqLLg
— Telugu Scribe (@TeluguScribe) March 5, 2025