జిహెచ్ఎంసి ఎన్నికల ముందే కాంగ్రెస్ కి భారీ షాక్..!

-

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి ఈ క్రమంలో ఇతర పార్టీల అభ్యర్థులు ఆకర్షించడానికి అధికార పార్టీ ఎంతగానో ప్రయత్నాలు మొదలుపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రజలు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు పోతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక లో ఇప్పటికే బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే మరో భారీ షాక్ తగిలింది.

అప్జల్ గంజ్ నియోజకవర్గంలోని బేగంబజార్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పురుషోత్తం కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ ఇచ్చారు. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురుషోత్తం. కాంగ్రెస్ నేత విక్రమ్ గౌడ్ నియోజకవర్గంలోని అభ్యర్థులు అందరినీ కూడా రోడ్డున పడేసిన బీజేపీలో చేరారని.. అందుకే తాను కూడా పార్టీని వీడాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news