బాబ్రీ మసీదు కావాలనుకునేవారు కాంగ్రెస్ కు ఓటేయండి: ఎంపీ బండి సంజయ్

-

తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఇందులో భాగంగా తెలంగాణలో నేటి నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్రలు ప్రారంభించింది.తమకు ఎంతో కలిసొచ్చిన రథయాత్ర పేరిట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రులకు బీజేపీ శ్రీకారం చుట్టింది. రాష్ట్రమొత్తాన్ని లోక్ సభ నియోజకవర్గాల వారీగా 5 క్లస్టర్లుగా విభజించి…ఒక్కో క్లస్టర్ కు ఒక రథాన్ని పంపింది.

కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాండూరులో బండి సంజయ్ తో కలిసి కేంద్రమంత్రి బీఎస్ వర్మ విజయసంక్పల యాత్రను ప్రారంభించారు.ఇక ఈ విజయ సంకల్ప సభలో పాల్గొన్నా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ…..’అయోధ్యలో రామమందిరం అలాగే ఉండాలంటే బీజేపీకి ఓటు వేయండి. రాముడి గుడి వద్దు బాబ్రీ మసీదు కావాలనుకుంటే కాంగ్రెస్కు ఓటేసుకోండి’ అని వ్యాఖ్యానించారు. రాముడు మోదీ అయితే.. రాక్షసులు రాహుల్, కేసీఆర్ అని తాండూర్ విజయ సంకల్పయాత్రలో సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news