ఏపీ మహిళలపై వరుసగా దాడులు : చంద్రబాబు సంచలన నిర్ణయం

-

పార్టీ ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రైతు ఆత్మహత్యలు.. మహిళలపై దాడుల విషయమై చర్చ జరిపారు. మహిళలపై దాడులు, రైతు ఆత్మహత్యలపై పోరాటాలకు పార్టీ కమిటీలు వేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జగన్ పాలనతో ఏపీ నరకాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని.. అత్యాచారాలు, దాడులు, రైతు ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం తల్లడిల్లుతోందని ఫైర్ అయ్యారు చంద్రబాబు.


ఒక్క ఏప్రిల్ నెలలోనే 31 అత్యాచార, దాడుల ఘటనలు జరిగాయన్నారు చంద్రబాబు. గత నెలలో 26 మంది రైతుల ఆత్మహత్యలు అని.. పరిశ్రమలు రాక… ఉపాధి లేక యువత వలసలు వెళ్లారని చెప్పారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని.. దాచేపల్లిలో టీడీపీ నేత కానిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ నేతల దాడిని ఖండించారు నేతలు. శ్రీకాళహస్తిలో నామినేషన్ కు వెళ్తున్న టీడీపీ నేత చలపతినాయుడుపై దాడికి పాల్పడటం దారుణమన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news