బీజేపీ ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ధర్మ గ్రంథం : ప్రధాని మోడీ

-

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు బీజేపీ అల్లాదుర్గం లో నిర్వహించిన భారీ బహిరంగ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని మండిపడ్డారు. అలాగే ఈ దేశంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని.. రాహుల్ గాంధీ తాత, నానమ్మ పదే పదే భారత రాజ్యాంగాన్ని మార్చి అవమానించారని తెలిపారు.

అలాగే.. దేశంలో తమ ప్రభుత్వం నిలబడటం కోసం ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. కాంగ్రెస్ తమ రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగాన్ని వాడుకుంటుదని.. రాజీవ్ గాంధీ హయాంలో దేశంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. మతపరమైన రిజర్వేషన్లు ఉండొద్దని అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ దారిలో ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందని ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ధర్మ గ్రంథం అని.. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అంబారీపై ఊరేగించానని ప్రధాని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news