బండి సంజయ్ ఐదేళ్లలో కేంద్రం నుండి తెలంగాణకు తెచ్చిందేమి లేదు : సీఎం రేవంత్

-

కరీంనగర్‌ ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మంగళవారం జమ్మికుంటలో జనజాతర పేరిట నిర్వహించిన బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైందని.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ ఊపిరి పోసిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక భూమిక పోషించారని కొనియాడారు.

ఉద్యమ సమయంలో కరీంనగర్ ప్రజలు కేసీఆర్‌కు అండగా ఉన్న.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన ఈ జిల్లాను పట్టించుకోవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎలక్షనస్ సెమీ ఫైనల్ అని.. సెమీస్‌లో కేసీఆర్‌ను చిత్తుచిత్తుగా ఓడించారు..

ఇప్పుడు ఫైనల్‌లో ప్రధాని మోడీని ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఐదేళ్లలో కేంద్రం నుండి తెలంగాణకు తెచ్చిందేమి లేదని మండిపడ్డారు .కరీంగర్ బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news