ఏపీలో కొత్తగా 73 కేసులు, టోటల్ ఎంత అంటే…!

-

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 73 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్యా 1332 కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా కారణంగా 31 మంది చనిపోయారు. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. ప్రభుత్వ చర్యలు ఫలించడం లేదు. కృష్ణా గుంటూరు కర్నూలు జిల్లాల్లోనే 53 కొత్త కేసులు నమోదు అయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఇప్పుడు ఏపీలో కరోనాతో పోరాడుతున్న వారి సంఖ్య 1014 గా ఉంది. 258 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.గుంటూరు జిల్లాలో కొత్తగా 29 కరోనా కేసులు నమోదు అయ్యాయి అని ప్రభుత్వం పేర్కొంది. కృష్ణా జిల్లాలో మొత్తం  236 మందికి కరోనా కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో 283, కర్నూలు జిల్లా, 343 మందికి, చిత్తూరు జిల్లాలో 77 మందికి కరోనా వైరస్ సోకింది.

Read more RELATED
Recommended to you

Latest news