కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీకి మరోసారి కరోనా

-

ఇండియాలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ కరోనా బారీన చాలా మంది ప్రముఖులు పడగా… కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ తాజాగా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించిన ఆయన.. తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

nithin gadkari
nithin gadkari

” నాకు మంగళవారం చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలున్నాయి. తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాను. నన్ను ఇటీవల కలిసిన వారు… ఐసోలేషన కు వెళ్లి..కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా.” అంటూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ట్వీట్‌ చేశారు. గతేడాది సెప్టెంబర్‌ లోనూ ఆయన కరోనా వైరస్‌ బారీన పడ్డారు. కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కరోనా బారీన పడుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, కర్ణాటక సీఎం బొమ్మై కూడా ఇటీవలే కరోనా బారీన పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news