ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రికి కరోనా పాజిటివ్..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధులు వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వైరస్ కి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇక కరోనా సెకండ్ వే స్టార్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Gopal-rai
Gopal-rai

ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా వ్యాప్తికి అక్కడి వాతావరణం కూడా అనుకూలంగా మారడంతో మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ కు కరోనా సోకింది. స్వల్ప అస్వస్థతో బాధ పడుతున్న ఆయన.. గురువారం ఆస్పత్రికి వెళ్లిగా అక్కడ వైద్యులు కరోనా టెస్ట్ చేశారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వైద్యులు ఆయనను ఐసోలేషన్‌ ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు.

మంత్రి గోపాల్ రాయ్ లో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం నేను క్షేమంగానే ఉన్నాను. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోండి. కరోనా నుంచి బయటపడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. కాగా, ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలో 5,246 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు కరోనా నివారణకు ఢిల్లీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news