జిహెచ్ఎంసి ఎన్నికలు.. వాళ్లది కపట ప్రేమ..!

-

తెలంగాణలో జరుగుతున్న జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న విమర్శలు ప్రతివిమర్శలు సంచలనంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రస్తుతం వివిధ పార్టీల నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఎక్కడ వరకు దారి తీస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఇటీవలే జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీల తీరు పై స్పందించిన టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ విమర్శలు గుప్పించారు

టిఆర్ఎస్ బిజెపి ఎమ్ఐఎమ్ పార్టీలు ప్రజల సమస్యలను విస్మరించి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానిస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మత విద్వేషాలను పూర్తిగా సద్దుమణిగేలా చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అంటూ వ్యాఖ్యానించారు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ. ఎన్నిసార్లు కోరినప్పటికీ ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వని బీజేపీ ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ పై కపట ప్రేమ చూపిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఘాట్ ను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను అంటూ చెప్పుకొచ్చారు టిడిపి ఎల్.రమణ.

Read more RELATED
Recommended to you

Latest news