క‌ర్ణాట‌క సీఎం బొమ్మైకి క‌రోనా పాజిటివ్

-

క‌రోనా వైర‌స్ సామాన్యుల‌తో పాటు రాష్ట్ర ముఖ్య‌మంత్రుల‌పై కూడా ప్ర‌తాపం చూపిస్తుంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా చాలా మంది ముఖ్య‌మంత్రులు క‌రోనా బారిన ప‌డ్డారు. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, బిహార్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ తోపాటు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు చాలా మంది క‌రోనా బారిన ప‌డ్డారు. తాజా గా క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స్వ‌రాజ్ బొమ్మై కూడా క‌రోనా బారిన పడ్డారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించారు.

అయితే త‌న‌కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని తెలిపారు. అలాగే ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్ లోనే ఉన్నాన‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. అలాగే ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంద‌రూ కూడా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసుకోవాల‌ని కోరారు. అలాగే వారు ఐసోలేష‌న్ లో ఉండాల‌ని విజ్ఞాప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news