టీఆర్ఎస్ ఎంపీ కే. కేశ‌వ‌రావుకు క‌రోనా పాజిటివ్

-

తెలంగాణ అధికార పార్టీలో నాయ‌కుల‌కు క‌రోనా భ‌యం ప‌ట్టుకుంది. మొద‌ట మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు క‌రోనా సోకిన విషయం తెలిసిందే. ఆయితే ఆయ‌న‌తో ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో ఉన్న మంత్రులు, ఎంపీలు అంద‌రికీ కూడా క‌రోనా టెన్ష‌న్ ప‌ట్టుకుంది. అయితే తాజా గా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లినే మంత్రులు, ఎంపీల బృందంలో మ‌రొక‌రికి క‌రోనా సోకింది. టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ నేత ఎంపీ కే. కేశ‌వ‌రావుకు క‌రోనా నిర్ధార‌ణ అయింది. ఆర్టీపీసీఆర్ లో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేయ‌గా అందులో పాజిటివ్ అని తెలింది.

దీంతో ఎంపీ కే. కేశ‌వ‌రావు హైద‌రాబాద్ లోని నిమ్స్ ఆస్ప‌త్రికి వెళ్లారు. అయితే ఆరోగ్యం నిల‌క‌డగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. అలాగే నిమ్స్ వైద్యుల స‌ల‌హాతో ఎంపీ కే. కేశ‌వ‌రావు హోం ఐసోలేష‌న్ లో ఉన్నారు. అయితే ఢిల్లీ ప‌ర్య‌ట‌నకు వెళ్లిన వారిలో ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గిరికి క‌రోనా పాజిటివ్ అని తెలింది. మొద‌ట మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు నిర్ధార‌ణ అయింది. త‌ర్వాత ఎంపీ రంజిత్ రెడ్డికి తాజా గా ఎంపీ కే. కేశ‌వ‌రావుకు క‌రోనా నిర్ధార‌ణ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news