ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా.. నేడు 75 కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు గ‌త కొద్ది రోజుల నుంచి త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. చాలా రోజుల నుంచి వంద లోపే క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. కాగ నేటి క‌రోనా బులిటెన్ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. కాగ ఈ కరోనా బులిటెన్ ప్రకారం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 75 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగ గురు వారంతో పోలిస్తే.. నేడు క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి.

గురు వారం ఆంధ్ర ప్ర‌దేశ్ లో 54 కేసులు న‌మోదు అయ్యాయి. కాగ నిన్న‌టి తో పోలిస్తే.. 21 కేసులు పెరిగాయి. కాగ నేడు కూడా రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 46 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం కేవ‌లం 536 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ గ‌డిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 11,846 క‌రోనా నిర్ధార‌ణ పరీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news