భారత్ పై కరోనా పంజా.. 24 గంటల్లో భారీగా నమోదైన కేసులు..!

-

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. . దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు.

తాజాగా, ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 14,933 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,40,215కు చేరుకుంది. వీటిలో ఇప్పటి వరకు 2,48,189 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,78,014 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 312 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 14,011కు పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version