గత 24 గంటల్లో 541 మరణాలు.. 47 కోట్లు దాటిన వ్యాక్సినేషన్..!

-

కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు సతమతమవుతూనే వున్నారు. కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా వలన ఇప్పటికే చాలా మంది ఎన్నో ఇబ్బందుల్లోకి గురయ్యారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ధరించడం వంటివి పాటించాలి.

గత 24 గంటల కరోనా వైరస్ అప్డేట్స్ చూస్తే… ఇంకా 410952 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో మరో 39258 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి రికవరీ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకూ 30820521 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు అని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ద్వారా తెలుస్తోంది.

అలానే గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 541 మంది మరణించారు. దీనితో ఇప్పటి వరకు
424351 మంది చనిపోయారు అని తాజాగా విడుదలైన నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇక వ్యాక్సినేషన్ గురించి చూస్తే… ఇప్పటికి 47 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక గత 24 గంటల్లో 6015842 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటికి మొత్తం 470298596 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news