భారత్ లో 14 లక్షలు దాటిన కరోనా కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో 49,931 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

coronavirus

దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,35,453కి చేరింది. అలాగే ఒక్క రోజులో దేశంలో 708 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 32,771కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుండి మొత్తం 9,17,568 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,85,114 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news