భారత్ లో కరోనా కలకలం.. రికార్డు స్థాయిలో కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,963 కరోనా పాజిటివ్ కేసులు, 834 కరోనా మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

coronavirus
 

దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 23,29,639కి చేరగా, కరోనా మరణాల సంఖ్య 46,091కి చేరింది. అలాగే ఇప్పటి వరకు కరోనా నుండి 16,39,599 మంది కోలుకోగా.. ప్రస్తుతం 6,43,948 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news