భారత్ లో కరోనా తుఫాన్.. 24 గంటల్లో భారీగా నమోదైన కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 69,239 కరోనా కేసులు నమోదయ్యాయి.

912 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 30,44,941కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 56,706కి పెరిగింది. భారత్‌లో ఇప్పటివరకు 22,80,567 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 7,07,668 యాక్టివ్ కరోనా కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news