భారత్ లో కరోనా కలకలం.. కొత్తగా 83 వేల కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 83,883 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,043 మంది మరణించారు.

corona virus

దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 38,53,406కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 67,376కి పెరిగింది. నిన్న 68,584 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 29,70,492 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,15,538 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,70,000 టెస్టులు జరిపినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news