రెండ్రోజుల్లో డీజీపీ పర్యటన.. ఎన్ కౌంటర్ కలకలం !

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవల గూడెం అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందగా ఇంకా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అయితే వారం రోజులపాటు మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో డీజీపీ పర్యటించనున్నారు. ఆయన నాలుగు రోజులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మిగతా మూడు రోజులు ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించనున్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో డీజీపీ పర్యటనలు ఉండనున్న నేపధ్యంలో మరో రెండు రోజుల్లో ఆయన పర్యటన ఉన్న నేపధ్యంలో ఈ ఎన్ కౌంటర్ జరగడంతో చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టు ప్రభావిత పోలిస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసులకు స్వయంగా డీజీపీ ఓరియెంటేషన్ క్లాసు లు చెప్పనున్నట్టు ప్రచారం జరిగింది. మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు వార్తల నేపధ్యంలో డీజీపీ వారం రోజుల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news