గత 24 గంటలలో కరోనా వైరస్ వలన 535 మంది మృతి, 42 కోట్లు దాటిన వ్యాక్సినేషన్..!

-

కరోనా వైరస్ వలన ఎన్నో సమస్యలు వస్తూనే వున్నాయి. ఇంకా వేలల్లో కరోనా కేసులు నమోదవుతూనే వున్నాయి. అదే విధంగా వందల్లో మరణాలు కూడా నమోదవుతూనే వున్నాయి. అయితే ఏది ఏమైనా కరోనా వైరస్ బారిన పడకుండా వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

గత 24 గంటలలో కరోనా వైరస్ అప్డేట్స్ గురించి చూస్తే… ఇప్పటికి 43 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక గత 24 గంటల్లో 51,18,210 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటికి మొత్తం 43,31,50,864 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా నుండి ఎంత మంది కోలుకున్నారు అనేది చూస్తే… దేశంలో అలానే ఇంకా 408212 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 535 మంది మరణించారు. దీనితో ఇప్పటి వరకు 420551 మంది చనిపోయారు అని తాజాగా విడుదలైన నివేదిక ద్వారా తెలుస్తోంది.

గత 24 గంటల్లో మరో 39972 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి రికవరీ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకూ 30543138 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు అని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ద్వారా తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news