బండ్ల గణేష్‌ కు బిగ్‌ షాక్‌.. అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన కోర్టు

-

టాలీవుడ్‌ పరిశ్రమలో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎప్పుడు ఏదో ఒక ట్వీట్‌ చేస్తూ… వార్తల్లో నిలుస్తారు బండ్ల గణేష్‌. అయితే.. తాజాగా సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఇవాళ చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు రెండవ రెండవ ఏఎంఎం కోర్టుకు హాజరయ్యారు సినీ నిర్మాత బండ్ల గణేష్.

జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద నుండి 95 లక్షల నగదు తీసుకున్నాడు బండ్ల గణేష్.. అయితే.. నగదు చెల్లింపులు తిరిగి జరపక పోవటంతో బ్యాంకులో చెక్కు వేశారు బాధితులు. దీంతో ఆ చెక్ బౌన్స్ అయింది. ఈ తరుణంలోనే… 2019 లో కోర్టును ఆశ్రయించారు బాధితులు. కోర్టు ముందు హాజరు కావాలని.. ఈ సందర్భంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. వాయిదాలకు కూడా హాజరు కాకపోవటంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఒంగోలు రెండవ ఏఎంఎం కోర్టు. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ బండ్ల గణేష్‌.. కోర్టు ముందు హాజరయ్యారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news