మహిళపై లైంగకదాడి : 2000 మంది మహిళల బట్టలు ఉతకాలని కోర్టు ఆదేశం !

-

మన దేశం లో మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… కొందరు రాక్షసుల్లో మార్పు రావడం లేదు. అయితే.. ఈ ఇటీవలే… బీహార్‌ రాష్ట్రంలోని మధుబానీ జిల్లాలో ఓ మహిళ పై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయం చూసి… ఆ మహిళపై దారుణానికి ఒడిగట్టాడు.

దీంతో ఆ మహిళ పోలీసులు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు తో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే.. తాజాగా ఈ కేసులో బెయిల్‌ కోసం ఆ నిందితుడు ప్రయత్నించాడు. అయితే…. ఈ సందర్భంగా బీహార్‌ లోని మధుబానీ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లైంగిక దాడికి పాల్పడినందుకు ఆ మహిళ గ్రామంలోని 2000 మంది మహిళల బట్టలు ఉతకాలని వింత తీర్పు ఇచ్చింది. ఇదే ఈ కేసులో అతడికి శిక్ష అని పేర్కొంది. అంతేకాదు…. ఈ కేసులో ఆ నిందితుడుకి బెయిల్‌ కూడా మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news