సీఎంకు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్ కు తరలింపు

-

కరోనాతో బాధ పడుతున్న ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌ కు తరలించారని చెబుతున్నారు. రావత్‌ కు ఛాతీలో ఇన్ఫెక్షన్‌ పెరిగినట్లు ఎయిమ్స్‌ వర్గాలు నిర్ధారణకు వచ్చినట్టు చెబుతున్నారు. ఇక సీఎం రావత్‌ కు ఈనెల 18న కరోనా పాజిటివ్‌ అని తేలింది.

దాంతో అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్‌ లోనే ఉన్నారు. కానీ నిన్నటి నుండి ఆయనకు జ్వరంగా ఉండటంతో నిన్న సాయంత్రం డెహ్రాడూన్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయనకు చాతిలో ఇన్ఫెక్షన్ ఉండడంతో అక్కడ వైద్యులు ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు రిఫర్ చేశారు. దీంతో ఆయన అక్కడి నుండి స్పెషల్ చాపర్ లో ఢిల్లీ వచ్చి ఎయిమ్స్‌ లో అడ్మిట్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news