టీఆర్ఎస్ కిరాయి ఇల్లు..అందరూ సమైక్య వాదులే : సీపీఐ నారాయణ

-

ఢిల్లీ : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కేబినెట్ లో 5 గురు తప్ప మిగిలిన వారంతా సమైక్య వాదులేనని చురకలు అంటించారు. టీఆర్ఎస్ పార్టీ పరిస్ఠితి అద్దె ఇల్లు లాగా తయారైందని ఎద్దేవా చేసారు. “దళిత బంధు” పథకాన్ని స్వాగతిస్తున్నామని… ఆ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నకలలో నేను నగిరి నుండి పోటీచేస్తానని ప్రచారం చేయడం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రాజ్యసభ అవకాశం వస్తేనే తీసుకోకుండా అజీజ్ పాషా కు ఇచ్చామన్నారు. తనకు పదవి కాంక్ష లేదని… బురద జల్లే ప్రయత్నం చేయొద్దని పేర్కొన్నారు. “పెగాసస్” వ్యవహారం తమ ప్రభుత్యంను అస్తిర అస్థిరపరిచే అంతర్జాతీయ కుట్ర అంటున్న మోడీ ప్రభుత్వం విచారణ కు ఎందుకు భయపడుతోందన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీ లో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందని.. దేవినేని ఉమను కొట్టి తిరిగి ఆయనపైనే కేసు పెట్టారని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లోని పరిస్థితుల పై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news