Parthiv Patel: పార్దివ్ పటేల్ ఇంట్లో తీవ్ర విషాదం..

-

టీం ఇండియా మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పార్థివ్‌ పటేల్‌ తండ్రి అజయ్‌ భాయ్‌ బిపిన్‌ చంద్ర పటేల్‌ ఇవాళ ఉదయం మృతి చెందారు.ఈ విషయాన్ని స్వయంగా పార్థివ్‌ పటేల్‌ తన సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

” మా నాన్న అజయ్‌ భాయ్‌ బిపిన్‌ చంద్ర పటేల్‌ ఇవాళ మృతి చెందారు. ఈ విషయాన్ని తెలియ చేసేందుకు చాలా చింతిస్తున్నాను. మా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించగలరు ” అని పార్థివ్‌ పటేల్‌ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యం లోనే… మాజీ క్రికెటర్లు ఆర్పీసింగ్‌ మరియు ప్రజ్ఞాన్‌ ఓజా పార్థివ్‌ పటేల్‌ కుటుంబానికి సంతాపం వ్యక్త పరిచారు.

అజయ్‌ భాయ్‌ బిపిన్‌ చంద్ర పటేల్‌ ఆత్మకు శాంతి^చేకూరాలని ప్రార్థించారు. కాగా… గత కొంత కాలం కిందట… మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అజయ్‌ భాయ్‌ బిపిన్‌ చంద్ర పటేల్ ను స్వస్థలం అహ్మదాబాద్‌ లోని ఓ ఆస్పత్రి లో చేర్చి వైద్యం అందించార కుటుంబ సభ్యులు. అయితే.. తాజాగా ఆయన పరిస్థితి విషమించడం కారణంగా మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news