క్రికెటర్​ పృథ్వీ షాపై యువతి దాడి

-

టీమ్​ ఇండియా క్రికెటర్​ పృథ్వీ షా పై దాడి జరిగింది. పృథ్వీ షా తన స్నేహితుడు సురేంద్రతో కలిసి బుధవారం రాత్రి ముంబయిలో శాంతా క్రూజ్​లోని ఓ ఫైవ్​ స్టార్​ హోటల్​కు వెళ్లాడు. అక్కడ షాను చూసిన కొందరూ సెల్ఫీ దిగేందుకు ముందుకొచ్చారు. అయితే అక్కడున్న ఇద్దరితో మాత్రమే షా సెల్ఫీ దిగాడు.

మిగతా వారు తమతో కూడా ఫొటో దిగాలని కోరగా షా నిరాకరించడంతో వాళ్లంతా తమకు సెల్ఫీ ఇచ్చే తీరాలంటూ డిమాండ్​ చేశారు. అక్కడే ఉన్న షా స్నేహితుడు హోటల్​ మేనేజర్​కు కంప్లైంట్​ చేశాడు. అక్కడికి వచ్చిన మేనేజర్​ నిందితులను వెళ్లగొట్టాడు. అందులో ఓ యువతి ఇదంతా అవమానకరంగా ఫీలై.. షా, తన స్నేహితుడు కలిసి వెళ్తున్న కారును వెంబడించింది. అంతే కాకుండా పృథ్వీతో వాగ్వాదానికి దిగడమే కాదు అతడిపై దాడి కూడా చేసింది.

తమపై దాడికి పాల్పడిన  నిందితులపై షా స్నేహితుడు ముంబయి ఓషివారా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల్లో ఇద్దరైన సనా అలియాస్​ సప్నా గిల్​తో పాటు శోభిత్​ ఠాకుర్​ను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news