వైసీపీ నేత దారుణ హత్య..కారం చల్లి.. వేటకొడవళ్లతో 18 సార్లు నరికి..!

-

హిందూపురంలో వైసీపీ నేత హత్యకు గురయ్యాడు. నియోజక వర్గ మాజీ సమన్వయకర్తగా వ్యవహరించిన చౌళూరు రామకృష్ణా రెడ్డిని ప్రత్యర్థులు హత్య చేశారు. ఆయన ఇంటి ముందే అతనిపై కారం పొడి చల్లి.. వేట కొడవళ్లతో నరికి హత్య చేశారు. ఈ హత్య పట్టణంలో సంచలనం రేపుతోంది.

రామకృష్ణా రెడ్డి తన స్వగ్రామం సమీపంలో కర్ణాక సరిహద్దు వద్ద దాబా నడిపిస్తున్నాడు. ఆయన దాబా మూసివేసి… తన ఇంటికి చేరుకున్నాడు. కారు దిగుతున్న సమయంలో కొందరు దుండగులు ఒక్క సారిగా ఆయన పైన దాడికి దిగారు. కారం పొడి చల్లి.. వేట కొడవళ్లతో 18 సార్లు దారుణంగా నరికారు. రామకృష్ణా రెడ్డి ఈ దాడితో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే అతడు మరణించాడు.

Read more RELATED
Recommended to you

Latest news