గోదావ‌రిఖ‌నిలో దారుణహ‌త్య‌..ఓ చోట త‌ల మ‌రో చోట మొండెం..!

-

గోదావ‌రిఖని జ్యోతిన‌గ‌ర్ లో దారుణం చోటుచేసుకుంది. యువ‌కుడిని హ‌త్య చేసి త‌ల మొండెం వేరు వేరుగా ప‌డేశారు. ప‌ట్టణానికి చెందిన కాంప‌ల్లి శంక‌ర్ అనే యువ‌కుడు స్థానికంగా ఓ మీసేవ‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శంక‌ర్ క‌నిపించ‌కుండా పోవ‌డంతో అత‌డి కుంటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా న‌మోదు చేసుకున్నారు. అయితే ఇంత‌లోనే శంక‌ర్ మృత‌దేహం పోల‌సుల‌కు ల‌భ్యం అయ్యింది.

crime news godhavarikhani

దుండ‌గులు అత‌డిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా మ‌త‌మార్చి త‌ల మొండెం వేరు చేసిన‌ట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. హత్య చేసిన తీరునుబ‌ట్టి పాత క‌క్ష్య‌ల కార‌ణంగానే హ‌త‌మార్చిన‌ట్టు భావిస్తున్నారు. ఇక ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. దారుణ హ‌త్య‌తో ప‌ట్టణం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. స్థానిక యువ‌కుడిని హ‌త్య చేయ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version