హైదరాబాద్‌ పరువు హత్య కేసులో 10 మంది అరెస్ట్‌

-

హైదరాబాద్‌ షాహి నాథ్ గంజ్ లో పరువు హత్యా కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీరజ్ అనే యువకున్ని కిరాతకంగా హతమార్చిన ఆయన బావమరుదులు & స్నేహితులను కర్ణాటక గుడిమిత్కల్ లో పట్టుకున్నారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నీరజ్ ను హత్యా చేసిన వెంటనే కర్ణాటక గుడిమత్కల్ ప్రాంతానికి పరార్ అయ్యారు నిందితులు. యువకుడిని కత్తులతో పొడిచి చంపిన సంజన కజిన్ బ్రదర్స్ ను & వారి స్నేహితులను కర్ణాటక గుడిమత్కల్ నుండి హైదరాబాద్ తీసుకువచ్చారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.

ఇక ఈ హత్యా కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న రాత్రి కొల్సివడ లో ద్విచక్రవాహనంపై తాత జగదీష్ పన్వర్ తో కలిసి వెళ్తుండగా విచక్షణా రహితంగా దాడి చేశారు. తాత జగదీశ్ పన్వర్ కళ్లముందే నీరజ్ తల మెడ ఛాతీ భాగంలో శరీరంపై 15 కత్తిపోట్లు పొడిచారు. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందుకే హత్యా చేశారని పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు.

పోలీసుల అదుపులో సంజన కజిన్ బ్రదర్స్ & వారి స్నేహితులు ఉన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపి కర్ణాటక గుడిమత్కల్ లో నిందితులను గుర్తించిన పోలీసులు.. రెండు వాహనాల పై వెళ్ళిన ఐడుగురు హంతకులు మృతుడు నీరజ్ బార్య సంజన అమే కజిన్ బ్రదర్స్ వారి ముగ్గురు స్నేహితులుగా గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఇప్పటికే 10మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు… రంగంలోకి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ & శాహినాడ్ క్రైం & డీసీపీ పార్టీ క్రైమ్ టీమ్ నాలుగు పోలీస్ బృందాలు గా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news