సరస్సులో కూలిన విమానం.. 19 మంది దుర్మణం

-

టాంజానియాలో ఘోర  ప్రమాదం జరిగింది. దార్‌ ఎస్‌ సలాం నగరం నుంచి బయలుదేరిన ప్రిసీషన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. ఈ ఘటనలో 19 మంది దుర్మణం చెందారు.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 26 మందిని కాపాడామని అధికారులు తెలిపారు. మిగతావారి కోసం గాలింపుచర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. వంద మీటర్ల ఎత్తులో విమానం ఉండగా వర్షం కురవడం సహా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఘటనకు సబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news