27 ఏళ్ళ గ్యాంగ్ స్టర్, పోలీసులను చంపాలని స్కెచ్ వేసి దొరికిపోయాడు…!

-

ఇటీవల కాన్పూర్ లో వికాస్ దుబే ఘటన తర్వాత గ్యాంగ్ స్టర్ ల విషయంలో పోలీసులు కాస్త కంగారు పడుతున్నారు. ఎక్కడ ఏ కాల్పులు జరుగుతాయో అని గ్యాంగ్ స్టర్ ల విషయంలో చాలా వరకు అప్రమత్తంగా ఉంటున్నారు. తాజాగా రాజస్థాన్ కి చెందిన ఒక గ్యాంగ్ స్టర్ ఇలాగే ట్రై చేసి పోలీసులకు దొరికిపోయాడు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో నివసిస్తున్న అర్షద్ ఖాన్, ఎటిఎం దొంగతనాలకు పాల్పడుతూ ఉంటాడు.

తాజాగా దక్షిణ ఢిల్లీకి వెళ్ళిన అతను ఒక ఏటీఎంని లేపేయాలి అని ప్లాన్ చేసాడు. దీనికి సంబంధించి పోలీసులకు పక్కా సమాచారం అందింది. సాయంత్రం 6:30 గంటల సమయంలో ఒక పోలీసు బృందం ఆ ప్రాంతంలో అతని కోసం నిఘా పెట్టింది. రాత్రి 7:30 గంటలకు గ్యాంగ్ స్టర్ కి చెందిన టయోటా సెడాన్ ను పోలీసు ఇన్ఫార్మర్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తను లొంగిపోవాలి అని కోరగా… తన నలుగురు ముఠా సభ్యులతో కలిసి కాల్పులకు దిగాడు. పోలీసులు కూడా అదే రేంజ్ లో ఎదురు కాల్పులు జరపడంతో రెడ్ హ్యాండెడ్ గా లొంగిపోయాడు. అతనికి పోలీసు కాల్పుల్లో స్వల్ప గాయాలు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news