ప్రియుడితో రాసలీలలు.. రాత్రిపూట భర్తను బయటికి పంపి మరీ !

-

ప్రియుడి కోసం భర్తను హత్య చేయించింది ఓ మహిళ. ఈ దారుణమైన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… వనపర్తి జిల్లా గాంధీనగర్ కు చెందిన బాలస్వామి కి లావణ్య అనే మహిళతో పది సంవత్సరాల కింద పెళ్లి జరిగింది. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాలస్వామి కూలి పని చేస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే లావణ్యకు నవీన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.

ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. లావణ్యను హెచ్చరించినా తన అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. అయితే ఎలాగైనా తన భర్తను అడ్డు తొలగించుకోవాలని స్క్తెచ్ వేసింది లావణ్య. ఈ నేపథ్యంలోనే కిరాయి గుండాలను… ఏర్పాటు చేసుకున్నారు. అర్ధరాత్రి మైసమ్మ గుడి దగ్గర కోడి కోసుకు రావాలని…తన భర్తను ఊరి చివరన గుడికి పంపింది. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ముఠా బాలస్వామినీ హతమార్చారు. అతన్ని మర్డర్ చేసి హైదరాబాదులో పూడ్చి పెట్టారు. ఇక ఈ ఘటన గురించి పోలీసులకు తెలియడంతో నిందితులను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news