హైదరాబాద్ లో ఘోరం.. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి..!

-

హైదరాబాద్ లో మరో విషాదం చోటుచేసుకుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, ఆపై ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఈరోజు ఉదయం బోరబండ డివిజన్ లోని మధురానగర్ లో సంచలనంగా మారింది. హైదరాబాద్ కు చెందిన జ్యోతి, విజయ్ భార్యభర్తలకు ఇద్దరు పిల్లలు. జ్యోతి బంజారాహిల్స్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తుంది. కొద్ది రోజుల వరకు అన్యోన్యంగా సాగిన వారి జీవితంలో కలహాలు మొదలయ్యాయి. రోజు ఏదో ఒక గొడవతో భార్య భర్తలు తీవ్ర మనస్థాపానికి గురయ్యేవారు.

ఇద్దరు భార్య భర్తలు ఇప్పటివరకు బాగానే ఉన్నా ఏమైందో ఏమో కానీ.. భర్త బయటకు వెళ్లడం గమనించి తన ఇద్దరు పిల్లలు అర్జున్(4), ఆదిత్య(2)లకు విషమిచ్చి చంపింది. ఆపై ఆమె కూడా ఉరివేసుకొని ప్రాణాలు కోల్పోయింది. అప్పుడే ఇంటికి వచ్చిన భర్త విజయ్ భార్య జ్యోతిని చూసి షాక్ తిన్నాడు. ఇద్దరు పిల్లలను కూడా విగతజీవిగా కనిపించడంతో భర్త విజయ్ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.అయితే అక్కడే ఉన్న స్థానికులు విజయ్ ను కాపాడారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న పిల్లలకు కూడా జ్యోతి విషమిచ్చి చంపేంతగా వీరిద్దరి మధ్య గొడవ ఏం జరిగిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు, స్థానికులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news