కాంగ్రెసోడు సచ్చిపోయిన పీనుగలాంటోడు.. ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్..!

-

మెట్ పల్లి పట్టణంలో పసుపు రైతుల కృతజ్ఞత సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రామ రాజ్యం వస్తే సమస్యలన్ని పోతాయన్నారు.  తాను కబ్జాలు చేయను,లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇయ్యనన్నారు. నాలుగు పైసల అవినీతి కూడా నామీద లేదు, ఉండదని వెల్లడించారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మూడు సార్లు గెలిచిన అవినీతి పరుడు ..ఎస్ ఐ ని ట్రాన్స్ఫర్ చేయిస్తే పది లక్షలు ..,సిఐ ని ట్రాన్స్ ఫర్ చేయిస్తే ఇరవై ఐదు లక్షలు తీసుకుంటాడు.

వాస్తవానికి దళారి వ్యవస్థను పెంచింది కాంగ్రెస్.. కాంగ్రెసోడు సచ్చిపోయిన పీనుగులాంటోడు.నా తండ్రైన , జీవన్ రెడ్డి అయినా ఒక్కటేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పసుపు సనాతన ధర్మం.. పసుపు బోర్డు నా రాజకీయ పునాది అని.. ఉత్తరప్రదేశ్ లో మూసిన చక్కర ఫ్యాక్టరీ తెరిపించిన ఘనత బీజేపీదే అన్నారు. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ తాళాలు తెరిపిస్తానని తెలిపారు.  ఈ ప్రాంత రైతులకు మళ్ళీ పూర్వ వైభవం తెస్తానని..శారీరకంగా కాదు,రాజకీయంగా కూడా కవిత నన్ను అందుకోలేదు. కవిత లిక్కర్ బోర్డు తెచ్చింది. ఇందూర్ పార్లమెంట్ లో 7 సీట్లు గెలిపించండి. ఇందూర్ పార్లమెంట్ లో బిజెపి హుందాతనం రావాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని వదిలి పెట్టేది లేదు.బీఅరెఎస్ కు ఓటు వేస్తే దానంత పాపం మరొకటి లేదు..మన కొడుకుకో, బిడ్డకో శాపం పెట్టినట్లే.హంగ్ వస్తె ఫస్ట్ జంప్ అయ్యేది రేవంత్ రెడ్డియే..నవంబర్ 30న తెలంగాణకు బీఅర్ఎస్ పీడ పోతుంది. ఇందూరు పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ స్థానాల్లో బిజేపి గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ తో చెరుకు పంటకు పునర్ వైభవం తీసుకొస్తానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news