కూతురిపై పెంపుడు తండ్రితో అత్యాచారం చేయించి పిండం అమ్ముకుంటున్న తల్లి !

-

తమిళనాడు ఈరోడ్ లో దారుణం చోటుచేసుకుంది. కూతురుపై పెంపుడు తండ్రితో అత్యాచారం చేయించి కన్న కూతురు పిండం అమ్ముకుంటుంది తల్లి. మైనర్ బాలిక నుంచి లెక్కుకుమించిన సార్లు పిండం విక్రయించింది ఈ ముఠా. తల్లి, పెంపుడు తండ్రి సహా మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఈ రోడ్ లోని రెండు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు.

కేరళ, ఆంధ్రాలో తిరుపతిలోని హాస్పటల్‌లో దర్యాప్తునకు ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. బాలికల నుంచి మూడేళ్లుగా పిండం సేకరించిన వ్యవహారంలో కేరళ, ఆంధ్రప్రదేశ్‌ లోని తిరుపతిలో దర్యాప్తు చేయడానికి తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే లైంగిక దాడి తట్టుకోలేక బాలిక ఇంటి నుండి పారిపోయింది.

ఈరోడుకు చెందిన 16 ఏళ్ల బాలిక వయస్సును 22 ఎళ్ళుగా ఆధార్‌కార్డులో మార్పుచేసి బాలిక పిండాన్ని చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్నారు. బాలికకు 14 ఏళ్లు ఉన్నప్పటి నుంచి పిండాన్ని ఇస్తూనట్లు వాంగ్మూలం ఇచ్చింది బాలిక. ఒక్కో పిండాన్ని 25 వేల నుండి 40వరకు అమ్ముకున్నట్లు నిర్ధారించారు. బాలిక పిండాన్ని తమిళనాడు మాత్రమే కాకుండా తిరువనంతపురానికి చెందిన ప్రైవేటు ఆస్పత్రికి, ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలో ఉన్న ఓ ఆస్పత్రికి విక్రయించింది ఈ ముఠా.

Read more RELATED
Recommended to you

Latest news