కృష్ణా జిల్లాలో ఘోరం… చెల్లిపైనే కామం తీర్చుకున్న అన్న‌… బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మైన‌ర్‌

-

నేటి స‌మాజంలో మాన‌వ సంబంధాలు మంట క‌లుస్తున్నాయి. ఎవ‌రికి వారు విచ‌క్ష‌ణ కోల్పోయి వావి వార‌స‌లు… బంధాలు, అనుబంధాలు మ‌ర్చిపోయి మ‌రీ ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఆస్తులు, అంత‌స్తుల‌తో పాటు కోరిక‌లు, శారీర‌క సుఖాల కోసం ఎంత‌కైనా తెగిస్తున్నారు… అన్ని మ‌ర్చిపోతున్నారు. ఇక ఇప్ప‌టి స‌మాజంలో ఆడపిల్లల రక్షణ రోజురోజుకు ప్రశ్నార్థకమైపోతోంది. ఆడ పిల్ల‌లు బ‌య‌ట‌కు వెళితే సేఫ్‌గా ఇంటికి వ‌స్తార‌న్న గ్యారెంటీ ఉండ‌డం లేదు.

ముఖ్యంగా కామాంధులు, మృగాళ్లు ఆడ‌పిల్ల‌ల విష‌యంలో చాలా పైశాచికంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. రోడ్డుపై ఆకతాయిలే కాదు.. సొంత ఇంటి సభ్యులే వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అన్న‌లో, త‌మ్ముళ్లో… బంధువులు కూడా ఆడ పిల్ల‌ల‌పై క‌న్నేసి చెర‌ప‌డుతున్నారంటే ఎంత దుర్మార్గంలో ఆలోచిస్తున్నారో ? ఆడ‌పిల్ల‌ల‌ను ఎలా ఆట బొమ్మ‌ల్లా చూస్తున్నారో తెలుస్తోంది.

తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లాలో ఓ ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13)పై.. ఆమె పెద్దమ్మ కొడుకు(20) పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వ‌య‌స్సులో చాలా చిన్న‌ది అయిన ఆ 13 ఏళ్ల అభం శుభం తెలియ‌ని బాలిక‌ను త‌న మాయ మాట‌ల‌తో లొంగ‌దీసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆమెపై ప‌లుమార్లు అత్యాచారం చేయ‌డంతో ఆమె గర్భం దాల్చింది.

బాలిక గర్భం దాల్చిన ఆర్నెళ్ల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు డాక్ట‌ర్ల‌ను ఆశ్ర‌యించారు. ఆమెను ప‌రీక్షించిన డాక్ట‌ర్లు అప్పుడు అబార్షన్‌కు అవకాశం లేకపోవడంతో బాలికను ఐసీడీఎస్ సంరక్షణలో ఉంచారు. బాలికకు తొమ్మిది నెలలు నిండటంతో బుధవారం రాత్రి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ చేయగా.. ఆడపిల్లకు జన్మనిచ్చింది. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి మృగాళ్ల‌పై మ‌రింత క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news