ప్రియుడి మోజు భర్తను దారుణంగా హత్య చేసిన భార్య…. కర్నూల్ జిల్లాలో ఘటన

-

పడక సుఖానికి అలవాటు పడిన ఓ ఇళ్లాలు ప్రియుడి మోజులో పడి సొంత భర్తనే అత్యంత దారుణంగా హతమార్చింది. ప్రియుడితో కలిసి భార్య భర్తను దారుణంగా చంపేసింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా కొడుమూరులో జరిగింది. సుధాకర్ అనే వ్యక్తి భార్య, ప్రియుడు కలిసి హత్య చేశారు. ఈనెల 8 నుంచి సుధాకర్ కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యం కుటుంబ సభ్యులు భార్య లక్ష్మీ, ప్రియుడు దస్తగిరి కలిసి చంపి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు విచారణ జరపగా విస్తూపోయే నిజం బయటపడింది. కోడుమూరు శివారులో సుధాకర్ ను చంపి పాతిపెట్టారు. సుధాకర్ కనిపించకపోవడంతో బంధువులు వెతికే ప్రయత్నం చేసినా… ఆచూకీ లభించలేదు. దీంతో సుధాకర్ భార్య లక్ష్మీపై అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కొడుమూరు సాయి గ్రీన్ సిటీలో ఓ డెడ్ బాడీని పాతిపెట్టారనే సమాచారం రావడంతో పోలీసులు విచారణ ప్రారంభించగా… డెడ్ బాడీ సుధాకర్ ది అని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news