భర్తను మంచానికి కట్టేసి..కూతురు,భార్యపై గ్యాంగ్ రేప్

-

దేశంలో రోజు రోజు కు దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడా చూసిన అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట ఓ మెకానిక్ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు… అతన్ని మంచానికి కట్టేసి భార్య, మైనర్ అయిన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేశారు.

రామ్ పూర్ జిల్లా సైఫాని పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారాన్ని గురైన మహిళను, ఆమె కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. కొద్దిరోజుల క్రితం కొందరు వ్యక్తులతో మెకానిక్ గొడవపడ్డాడనే విషయం తమకు తెలిసిందని… వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news