ప్రపంచ అథ్లెటిక్స్‌ ర్యాంకింగ్స్‌లో.. నంబర్ వన్ నీరజ్ చోప్రా

-

ఇండియన్ గోల్డెన్ బాయ్.. జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనత సాధించాడు. జావెలిన్‌ ప్రపంచంలో అద్భుత విజయాలను సాధిస్తున్న నీరజ్‌ జావెలిన్‌ త్రోలో నంబర్‌వన్‌ ర్యాంకు సాధించిన తొలి భారతీయుడిగా ఓ నయా చరిత్రను సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ తాజా ర్యాంకింగ్స్‌లో నీరజ్‌ 1455 పాయింట్లతో.. ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్ ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

అంతే కాకుండా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో నంబర్‌వన్‌ అయిన తొలి భారత అథ్లెట్‌గా కూడా నీరజ్‌ నిలిచాడు. గత సీజన్లో డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ విజేతగా నిలిచిన నీరజ్‌.. ఈ ఏడాది దోహాలో జరిగిన డైమండ్‌ లీగ్‌ తొలి అంచె టోర్నీలోనూ టైటిల్​ను సొంతం చేసుకున్నాడు. ఇక నెదర్లాండ్స్‌లో జూన్‌ 4న జరిగే ఫానీ బ్లాంకర్స్‌ కొయెన్‌ (ఎఫ్‌బీకే) ఈవెంట్ల కోసం త్వరలోనే బరిలో దిగబోతున్నాడు. ఈ ఏడాది ఎలాగైనా 90 మీటర్ల దూరాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్న నీరజ్‌.. ఎఫ్‌బీకే టోర్నీలో అయినా ఆ లక్ష్యాన్ని సాధిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news