Breaking : బెంగాల్‌లో ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్ర‌మాదం

-

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. బెంగాల్ లోని దొమోహ‌నీ ప్రాంతం వ‌ద్ద ఎక్స్ ప్రెస్ రైలు ప్ర‌మాదానికి గురి అయింది. ఎక్స్ ప్రెస్ రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డంతో ఈ ప్ర‌మాదం సంబ‌వించిన‌ట్టు తెలుస్తుంది.గువాహ‌టి న‌గ‌రం నుంచి బిక‌నేరు న‌గ‌రానికి వెళ్తున్న ఎక్స్ ప్రెస్ కు ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. ఈ గువాహ‌టి – బిక‌నేరు ఎక్స్ ప్రెస్ రైలు బెంగాల్ లోని దొమోహ‌నీ న‌గ‌రం శివారులో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

అయితే ఎక్స్ ప్రెస్ రైలు ఒకే సారి ప‌ట్టాలు త‌ప్ప‌డంతో రైలు ప్ర‌యాణీకులు అంద‌రూ భ‌యాందోళ‌న‌తో రైలు దిగారు. స‌మాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు, బెంగాల్ పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని ఈ రైలు ప్ర‌మాదం గాయ‌ప‌డ్డ ప్ర‌యాణికులకు స‌హాయక చ‌ర్యలు చేప‌ట్టారు. కాగ ఈ ప్ర‌మాదంలో ప్ర‌స్తుతం ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని స‌మాచారం. అయితే ఈ రైలు ప్ర‌మాదం పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news