రూ.200 కోసం తీవ్ర ఘర్షణ.. యువకుడి దుర్మరణం

-

కేవలం రూపాయలు రెండు వందల కోసం జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన అమానుష్య ఘటన హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పరిధిలో చోటుచేసుకుంది. కొండాపూర్ లోని ఓ షాపింగ్  మాల్ లో పనిచేస్తున్న ఇద్దరు యువకులు మంచి స్నేహితులు. వీరు ఇద్దరు కూడా మైనర్లే కావడం గమనార్హం. అయితే వీరిద్దరూ కలిసి బుధవారం అర్ధరాత్రి విపరీతంగా మద్యం సేవించారు. అలా తాగుతుండగా ఇద్దరు మధ్య రెండు వందల కోసం స్వల్ప వివాదం చోటుచేసుకుంది.

మాట మాట పెరిగి ఆ గొడవ కాస్త కొట్టుకునే అంతవరకు వెళ్ళింది. ఈ క్రమంలో అందులో ఓ మైనర్ మరో మైనర్ ముక్కుపై బలంగా గుద్దాడు. ఈ తరుణంలో అతడు అక్కడే కుప్ప కూలిపోయాడు. దీంతో స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఇవాళ అతడు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news