రఘువీరా రెడ్డి పొలిటికల్ బ్రోకర్.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి పై మంత్రి పెద్దిరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘువీరారెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్ అని ఆయన అభివర్ణించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీని చంపారని ఆయన ఆరోపించారు. అలాంటి ముఠాలు కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలానే ఉన్నాయని ఎద్దేవా చేశారు.

కానీ కాంగ్రెస్ పార్టీని తాను బతికించానని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు ఆయన జపం చేశారని ఎద్దేవా చేశారు. వైయస్ మరణించిన తర్వాత ఆయన పైనే విమర్శలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో రఘువీరారెడ్డి తమ నియోజకవర్గానికి ఇన్చార్జి మంత్రిగా ఉండి కూడా కనీసం కన్నెత్తి కూడా చూడలేదని మండిపడ్డారు. తాను కూనీలు చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మంత్రి పెద్దిరెడ్డి ఛాలెంజ్ చేశారు. ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news