ఖమ్మం జిల్లాలో ‘మరో ఇంజక్షన్​ హత్య’.. ఈసారి భార్యను చంపిన భర్త

-

ఖమ్మం జిల్లాలో మరో ఇంజక్షన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈసారి భర్త తన భార్యను చంపడానికి ఇంజక్షన్ ఉపయోగించాడు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి.. భార్యలిద్దరి మధ్య గొడవలతో విసిగిపోయి రెండో భార్యపై ఇంజక్షన్ ప్రయోగించి చంపేశాడు.

ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం ఓ వైద్యుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అతడికి మొదటి భార్యతో సంతానం కలగకపోవడంతో.. తన కంటే 20 ఏళ్లు చిన్నదైన నవీన అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆమెకు తొలుత పాప పుట్టింది. ఆ తర్వాత భార్యలిద్దరి మధ్య గొడవలు జరిగాయి. నవీన మరోసారి గర్భం దాల్చింది. ప్రసవం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రెండోసారి ఆడపిల్లే పుట్టింది. ఈ విషయంలో భార్యలిద్దరి మధ్య గొడవలు జరిగాయి.

భార్యలిద్దరి మధ్య గొడవలతో విసిగిపోయిన భిక్షం ప్రసవించిన రోజే నవీనకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడు. ఏమీ తెలియనట్టు ఆస్పత్రి నిర్లక్ష్యంతోనే చనిపోయిందని బంధువులతో కలిసి ఆందోళనకు దిగాడు. అనుమానం వచ్చిన ఆస్పత్రి సిబ్బంది.. సీసీకెమెరా దృశ్యాలు పరిశీలించగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news