మధ్యప్రదేశ్ యువతులపై లైంగిక వేధింపులు: ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

-

మధ్యప్రదేశ్ లోని అలీరాజ్ పూర్ గిరిజన జాతరలో మహిళల పట్ల క్రూరంగా ప్రవరిస్తూ.. వారిని లైంగికంగా వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అలీరాజ్ పూర్ జిల్లా భగోరియా గిరిజన జాతర సందర్భంగా కొంతమంది ఆకతాయిలు.. రోడ్డు పక్కన ఉన్న గిరిజన యువతులను లైంగికంగా వేధించారు. ఒకరి తర్వాత ఒకరు రాక్షసంగా ప్రవర్తించారు. ఈ సంఘటనను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

ఈ ఘటనలపై అలీరాజ్ పూర్ పోలీసులు స్పందించారు. వీడియో వైరల్ కావడంతో ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అలీరాజ్ పూర్ ఎస్పీ మనోజ్ కుమార్ వెల్లడించారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై  మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ, అధికార బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో ‘సేవ్ డాటర్ క్యాంపెయిన్’ ఇలాగే జరుగుతుందా అంటూ.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాలను ప్రశ్నిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news