సినిమా చూసి తండ్రితో కలిసి.. బామ్మను 9 ముక్కలు చేసిన మనవడు

-

సినిమాలు చూసి నేరాలు చేయడం ఈరోజుల్లో కామన్ అయిపోయింది. కన్నతల్లి అని కనికరం లేకుండా ఓ కొడుకు.. ప్రేమగా చూసుకునే బామ్మ అని కూడా చూడకుండా మనవడు ఓ వృద్ధురాలిని అత్యంత క్రూరంగా హతమార్చారు. అంతా చేసి ఏం ఎరగనట్టు పోలీస్ స్టేషన్‌లో ఆమె అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పుణె కేశవ్‌నగర్‌లో చోటుచేసుకుంది.

ఉషా విఠల్ గైక్వాడ్​(64) అనే మహిళ దేహురోడ్​లోని ఆర్మీ క్యాంప్​లో పని చేసేవారు. పదవీవిరమణ తర్వాత ఆమె కేశవనగర్​లో స్థిరపడ్డారు. ఇంట్లో ఆమెతో పాటు కొడుకు సందీప్​ గైక్వాడ్(45)​, కోడలు, మనవడు సాహిల్ అలియాస్ గుడ్డు గైక్వాడ్​(20) ఉండేవారు. తరచూ అత్త- కోడలి మధ్య వాగ్వాదం జరిగేది. ఈ క్రమంలోనే ఆగస్టు 5న ఉషకు కోడలితో మరోసారి గొడవ జరిగింది. పార్లే బిస్కెట్లు ఇవ్వలేదనే విషయంపై ఇరువురూ గొడవపడ్డారు. దీంతో కోడలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. మధ్యాహ్నం సమయంలో వృద్ధురాలు నిద్రలోకి జారుకున్నప్పుడు మనవడు సాహిల్ ఆమెను బాత్రూంలోకి లాక్కెళ్లి గొంతు నులిమి హతమార్చాడు.

ఆ తర్వాత ఆమె శరీరాన్ని మాయం చేసేందుకు తన తండ్రితో కలిసి అత్యంత కిరాతకమైన ప్లాన్ వేశాడు. ఓ దుకాణం నుంచి చెట్లను నరికే ఎలక్ట్రిక్ కటర్​ను కొనుగోలు చేసి ఆ కటర్‌తో ఆ వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికారు. 9 భాగాలుగా నరికి సంచుల్లో కుక్కి ముథా నది వద్దకు వెళ్లి ఆ నీటిలో మూడు సంచులు పడేశారు. పక్కనే ఉన్న చెత్త డిపోలో మరో బ్యాగ్‌ను పడేశారు. రక్తంతో తడిచిన కత్తిని, దుస్తులను మజ్రీ నది ఒడ్డున వదిలేశారు.

తర్వాత వృద్ధురాలు అదృశ్యమైనట్లు పోలీసులకు మిస్సింగ్​ కంప్లైంట్​ ఇచ్చారు. ఆగస్టు 10న కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఉష కూతురికి తన అన్నమీద అనుమానం వచ్చింది. సోదరుడే తన తల్లిని అపహరించుంటాడని మృతురాలి కూతురు కేసు పెట్టింది. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఉష కుమారుడు, మనవడే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తేలింది. వీరిద్దరిని రిమాండ్​కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news