ఫ్రెండ్ మాటలు నమ్మి భార్యను చంపిన భర్త

-

స్నేహితురాలి మాటలు నమ్మ భార్యను హత్య చేశాడో భర్త. అంతేకాకుండా ఆ చిత్రాలను మొబైల్ లో రికార్డు చేశాడు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడితో పాటు అతడి తల్లిని అరెస్టు చేశారు.

మీర్‌పేట సమీపంలోని నందనవనం కాలనీలో నివసించే కీర్తి సల్మాన్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. కొన్నాళ్లకు మనస్పర్థలతో విడిపోయారు. కీర్తి మరో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే సల్మాన్ సోదరి సబా ఫాతిమాతో కీర్తికి గొడవలయ్యాయి.

కొంతకాలం తర్వాత కీర్తి స్నేహితుడు, పాత నేరస్థుడైన దాసరి సురేందర్‌ అలియాస్‌ మోయిన్‌, మునీర్‌(28)తో సబా ఫాతిమాకు పెళ్లి జరిగింది. అతను సుమారు 40 కేసుల్లో నిందితుడు. పీడీ కేసులూ ఉన్నాయి. జైలు నుంచి బయటికి వచ్చి తన మకాంని బైరామల్‌గూడ అల్తాఫ్‌నగర్‌కు మార్చాడు. తల్లి, భార్యతో కలిసి ఉన్నాడు. అక్కడే ఓ పాప(9 నెలలు)కు ఫాతిమా జన్మనిచ్చింది.

ఓ చోరీ కేసులో బాలాపూర్‌ పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. తిరిగి ఈ ఏడాది జులైలో విడుదలైన సురేందర్‌కు అతని భార్య పట్ల సమీపంలోని ఓ ఇంట్లో ఉంటున్న కీర్తి చెడుగా ప్రచారం చేసింది. మరో వ్యక్తితో ఆమె చనువుగా ఉందంటూ అతనికి నూరిపోసింది. దీంతో సురేందర్‌ తన భార్య ఫాతిమాను అనుమానించి తరచూ తాగి కొట్టేవాడు.  గత నెల 30వ తేదీ రాత్రి తప్పతాగివచ్చి ఆమె తలను గోడకేసి కొట్టడంతో ఫాతిమా అపస్మారకస్థితికి చేరింది. ఇదంతా సురేందర్‌ తల్లి యాదమ్మ(58) చూస్తూనే ఉన్నా వారించలేదు. 31వ తేదీ ఉదయం ఆస్పత్రికి ఆమెను తరలించగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.

మృతురాలి తల్లి  ఫిర్యాదుతో ఎల్బీనగర్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సురేందర్‌తోపాటు అతని తల్లిని, కీర్తిని అరెస్టు చేశారు. తల్లి మరణంతో అనాథగా మారిన తొమ్మిది నెలల వయసున్న కుమార్తెను పోలీసులు శిశువిహార్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news