ఇద్ద‌రు బాలిక‌ల‌పై అత్యాచారం చేసిన కేసులో రేపిస్టు అరెస్టు

-

నెల్లూరు: అభం శుభం తెలియని ఇద్దరు బాలుకలపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడ్ని నెల్లూరు రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల కల్లూరిపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో 8, 9 ఏళ్ల బాలికలపై వేర్వేరుగా మిఠాయిలు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే తంతు వరుసగా రెండు రోజులు కొనసాగించాడు. చివరి ప్రయత్నంలో స్థానికుల కంటపడి బహిర్గతమవడంతో చిన్నారుల బంధువులు, స్థానికులు అతడిని అదుపులోకి తీసుకుని చితకబాదారు. అతను అదే ప్రాంతానికి చెందిన అసీమ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న నెల్లూరురూరల్‌ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని తీవ్ర గాయాలుండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రావడంతో అతనిపై అత్యాచారం కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించినట్లు నెల్లూరురూరల్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version