బాలికపై గ్యాంగ్ రేప్.. నగ్నంగా నడుచుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్

-

గ్యాంగ్ రేప్ కు గురైన బాలిక నగ్నంగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న వీడియో యూపీలో దుమారం రేపింది. ట్విటర్ లో వైరల్ అయిన ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సెప్టెంబర్ 1న జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకరిని అరెస్టు చేశారు.

యూపీలోని మొరాదాబాద్​ జిల్లా భోజ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 15 ఏళ్ల బాలిక.. సెప్టెంబర్​ 1వ తేదీన పక్క గ్రామంలో జరుగుతున్న సంతకు వెళ్లింది. తిరిగి వస్తుండగా నితిన్, కపిల్, అజయ్, నాజియా అలీ, ఇమ్రాన్​ కలిసి.. బాలికను ఓ నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లారు. ఆమెను వివస్త్రను చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కణ్నుంచి పరారయ్యారు. నిందితులు వెళ్లిపోయాక.. బాధితురాలు అలానే నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లి.. కుటుంబసభ్యులకు జరిగినదంతా చెప్పింది.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదును స్వీకరించి, కేసు నమోదు చేసే విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే బాధితురాలు, కుటుంబం కలిసి పోలీస్ స్టేషన్​కు వెళ్లి, ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయలేదని కొందరు చెబుతున్నారు. వారం తర్వాత ఎస్​ఎస్​పీ హేమంత్​ కుటియాల్​ను కలవగా.. అప్పుడు కేసు పెట్టారని అంటున్నారు.

“తన మేనకోడలిపై అత్యాచారం జరిగిందని ఓ వ్యక్తి సెప్టెంబర్ 7న ఫిర్యాదు చేశాడు. మేము దర్యాప్తు ప్రారంభించాం. కానీ.. అలాంటిదేమీ లేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. అయినా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఒక నిందితుడ్ని అరెస్టు చేశాం.” అని మొరాదాబాద్​ ఎస్​పీ(గ్రామీణ) సందీప్ కుమార్ మీనా స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news